ఎన్టీఆర్ రామ్ చరణ్ భయపడ్డా.. నో ఫియర్ అంటున్న బాలయ్య..?

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అఖండ. ఈ సినిమా ఇప్పటికే షూటింగు ను ముగించుకుంది.ఇక బాలకృష్ణ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాని అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నది ఉన్నట్లు సమాచారం.

ఇక బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న మూడో చిత్రం కనుక.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి తమ అభిమానులకు.ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయి అని సమాచారం.ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను కూడా హార్ట్ స్టార్ దక్కించుకుందని సమాచారం.ఈ సినిమాకు సంబంధించి ఉగాది కానుకగా ఒక టీజర్ను విడుదల చేయగా.. ఆ టీజర్ కి భారీ స్పందన రావడం విశేషం.

ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ తో ఒక సినిమాని నిర్మించబోతున్నారట. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమా కూడా ఓకే అయితే.. ఈ సినిమా బాలకృష్ణ కి మరొక టర్నింగ్ పాయింట్ అవుతున్నట్లు తన అభిమానులు తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని సమాచారం.ఇక ఎన్టీఆర్,రామ్ చరణ్ RRR సినిమా పోస్ట్ ఫోన్ చేసుకున్న విషయం తెలిసిందే. కానీ బాలకృష్ణ మట్టుకు తను అనుకున్న రోజున విడుదల చేస్తున్నాడు అని బాలకృష్ణ అభిమానం స గర్వంగా చెప్పుకుంటున్నారు.