హోస్ట్ గా ఎన్టీఆర్ ఆ షోలో లేనట్లేనా.. ?

బుల్లితెర జెమిని టీవిలో ప్రసారమయిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు మొదటి ఎపిసోడ్ సుపర్ సక్సస్ అయింది. తొలి ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిధిగా వచ్చి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఒక పక్క హాట్ సీట్ చరణ్ మరో పక్క హోస్ట్ గా ఎన్టీఆర్ లను ఒకే వేదికపై చూసి అభిమానులు పండగ చేసుకున్నారు. ఎన్టీఆర్ యాంకరింగ్ కి ను మెచ్చి `బుల్లితెర‌పై షోమేన్‌…` అంటూ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ ను అభివర్ణించారు.

అయితే ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు షో గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో హోస్ట్ గా రామ్ చరణ్ వస్తున్నాడని, హాట్ సీట్ లో ఎన్టీఆర్ కూర్చుని ఆట ఆడబోతున్నట్టు ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఇది కేవలం ఒక్క ఎపిసోడ్ కు మాత్రమే అని మిగతా ఎపిసోడ్స్ లో ఎప్పటిలాగానే ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తారని తెలుస్తుంది.అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నటిస్తున్న భారీ చిత్రం ట్రిబుల్ ఆర్.చివరి ఎపిసోడ్ సమయానికి ఈ చిత్రానికి ప్ర‌మోష‌న్లు కూడా బాగా జ‌రుగుతుంటాయి కాబట్టి ఇలా బుల్లితెరలో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.