అలనాటి స్టార్ హీరోయిన్ లలో రోజు కూడా ఒకరు. ఈమె ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా,అప్పట్లో వెండితెరపై స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఇక ఈమె ప్రజల సేవకే రాజకీయాల వైపు వెళ్లగా ఇప్పుడూ నగరి ఎమ్మెల్యే గా చేస్తున్నది. ఇక ఈమెకు పూలతో అభిషేకం చేశారట ఎందుకో చూద్దాం.
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, బుల్లితెరపై జడ్జిగా కనిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా ఈమె నగరి ప్రజల విషయంలో చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటున్నారట. ఇదే క్రమంలో ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ఆకర్షణగా నిలుస్తుంది ఆమె. ఇక ఎమ్మెల్యేగా చేసిన పనులకు ప్రజలు కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు రోజాకు.
గతంలో ఒక ప్రాంతానికి నీరు లేకపోవడంతో.. స్వయానా వారికి మంచి నీటిని కల్పించినందుకు రోజా పై అభిమానులు పూలవర్షం కురిపించారు.ఇది ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం అలాంటి ఘటనే మరి జరిగింది. ఈమె ప్రజలకు చేసిన పని వల్ల ఈమె ఎంతో సంబరపడిపోతోంది. ప్రస్తుతం జరిగినటువంటి ఈ పాలాభిషేకం, పుష్పాభిషేకం వంటి ఫోటోలు చాలా వైరల్ గా మారడం జరిగాయి.
ఇకపోతే ఆమె సినీ ఇండస్ట్రీలో కూడా ఒక వైపు బిజీగా ఉంటూ , మరో వైపు రాజకీయంగా కూడా ముందడుగు వేస్తూ, కుటుంబంలో తల్లిగా, భార్యగా తన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తోంది రోజా. రోజా తన భర్తతో కలిసి ప్రజల కోసం పలు సేవా కార్యక్రమాలను కూడా చేపడుతోంది. అయితే ఈమె సామాన్య ప్రజలు ఎలా ఉంటారో తను కూడా అలాగే జీవించాలని ఉద్దేశంతోనే ఉంటుంది.