కరీనా కపూర్ ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఈ బాలీవుడ్ హీరో , హీరోయిన్ లు అయిన సైఫ్ అలీ ఖాన్_కరీనా కపూర్ జోడి సినీ ఇండస్ట్రీ ముఖ్యంగా బాలీవుడ్ లో స్టార్ పొజిషన్ అనుభవిస్తూ వున్నారు. అయితే ఇటీవల వీరికి సంబంధించిన ఒక వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే, వీరి పాత ఇంటిని ఎంతకు అద్దెకు ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు.. అద్దె ఎంతో తెలుసా.. అక్షరాల రూ. 3.5 లక్షలకు అద్దెకు ఇచ్చారట. ఈ ఇంటిలో సైఫ్ జంట తమ కొడుకు తైమూర్ కలిసి ఒక సంవత్సరం పాటు ఇంటిలో నివసించారు.

ఇప్పుడు ఇంటికి .. అద్దెకి వేరే వారు నివసించటానికి వస్తున్నారట. ముంబై లోని ఫార్చ్యూన్ హైట్స్ లో ఈ పాత ఇల్లు ఉంది. ఈ సంవత్సరంలో సైఫ్ కుటుంబం వేరే ఇంటికి మారటంతో పాత ఇంటిని ఖాళీగా ఉంచకుండా వేరే వారికి అద్దెకు ఇవ్వాలని అనుకున్నారని, ఈమధ్య తాజా వార్తలు వినిపిస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్.. అసోసియేషన్ మీడియా ఎల్. ఎల్ .పి ద్వారా గిల్ట్ అనే సంస్థకు వారి ఇంటిని అద్దెకు ఇచ్చారు. ఇంటిని అద్దెకు ఇచ్చే విషయం పై ఒప్పంద పత్రం ను ఒక వెబ్ సైట్ లో యాక్సెస్ చేశారు.

అంతేకాకుండా ఆ సంస్థ వారు 1.5 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు. ఈ అపార్ట్మెంట్ విస్తీర్ణం 1500 చదరపు మీటర్లు విస్తీర్ణం కలిగి ఉంది. ఈ హౌస్ లో వెహికల్ పార్కింగ్ చేసుకునే ప్లేస్ బాగానే ఉంది. కనీసం రెండు కార్లయినా పార్కింగ్ చేసుకోవచ్చు.

ఈ ఇంటిని తాత్కాలికంగానే అద్దెకు ఇచ్చారు. కనీసం మూడు సంవత్సరాల పాటు అద్దెకు ఉండొచ్చు. ప్రతి సంవత్సరం నుండి అద్దె పెరుగుతూ ఉంటుంది. సంవత్సరం అద్దె రూ.3.5 లక్షలు ,రెండవ సంవత్సరంలో రూ. 3.67 లక్షలు, ఇంకో సంవత్సరం అంత కంటే కొద్దిగా ఎక్కువ గానే ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ విలువ 13, 14 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుంది. వీరిద్దరూ కలిసి తన కొడుకుతో విహార యాత్రకు వెళ్తున్నారు. వీరు మాల్దీవులకు వెళ్ళటానికి ముందు 13 ఆగస్టు 2021 ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. అందుకనే వీరి ఇంటిని అద్దెకి ఇవ్వటానికి సిద్ధపడ్డారు. ఇక కరీనా విషయానికొస్తే ఆమె కొన్ని సినిమాలలో బిజీగా ఉండి పోయింది.