వెంకీకి రేచీకటి, వ‌రుణ్‌కు న‌త్తి..ఇక ఎంటర్టైన్మెంట్ పీక్సే?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్‌ తేజ్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `ఎఫ్‌-3`. 2019లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఎఫ్ 3ను నిర్మిస్తున్నారు.

క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఇటీవ‌లె మ‌ళ్లీ ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేశ్, నత్తి ఉన్న వ్యక్తి పాత్రలో వరుణ్ క‌నిపిస్తార‌ట‌.

వారి వారి స‌మ‌స్య‌ల‌తో వెంకీ, వ‌రుణ్‌లు పండించే కామెడీ పీక్స్‌లో ఉంటుంద‌ని.. ప్రేక్ష‌కులు ఫుల్ ఎంట‌ర్టైన్ అవుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, ఎఫ్ 3 కథ కూడా డబ్బుల చుట్టూనే తిరగనుంద‌ట‌. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. వాళ్లు ప‌డేపాట్ల‌ని ద‌ర్శ‌కుడు ఫ‌న్నీ చూపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది.