గోవాకు వెళ్లిన నాగచైతన్య సమంత.. కారణం అదేనట..?

టాలీవుడ్ లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారిలో అక్కినేని నాగ చైతన్య , సమంత .. వీరిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఇక మన టాలీవుడ్ లోనే కాకుండా ఈ కపుల్స్ ను సౌత్ ఇండియాలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరూ జీవితంలో ఎంతో అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తున్నారు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆప్యాయంగా కూడా ఉంటారు. వీరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి ప్రేమ సుదీర్ఘ కాలం పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఈ జంటను చూస్తుంటే అభిమానుల్లో చెప్పలేని ఆనందం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇద్దరూ తమ కెరీయర్ లో బిజీబిజీగా గడిపేస్తున్నా , వీరు కొన్ని సందర్భాలలో ప్రత్యేకంగా ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకునే పార్టీలు చాలానే వున్నాయి. వీరి పెళ్లి గోవాలో అయ్యింది .గోవా అంటే వీరికి ఎనలేని అభిమానం.. వీరే కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా గోవా అంటే చాలా ఇష్టం..

వారికి ఇష్టమైన గోవాలో ఒక డ్రీమ్ హౌస్ ను నిర్మించాలని అనుకుంటున్నారు. వీరు ఆ డ్రీం హౌస్ ని ఒక గెస్ట్ హౌస్ లాగా నిర్మించాలని ప్లాన్ కూడా చేస్తున్నారట. ఆ డ్రీం హౌస్ ఎలా ఉండాలి అని అనుకున్నారంటే, సముద్రపు ఒడ్డున అత్యంత అందంగా నిర్మించాలని అనుకున్నారు.

సమంత ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గోవాలో ఉండబోతున్నాము అని చెప్పింది. అంతేకాకుండా డ్రీమ్ హౌస్ పూర్తి అయ్యిందని సమంత ఇండస్ట్రీకి వర్గాల వారికి చెప్పారట.

ఇక నాగచైతన్య , సమంత ఇద్దరు కూడా బిజీగా ఉన్నారు. నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాలో బాగా చేశాడు. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక బాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా కూడా ఈయన చేశాడు. అమీర్ ఖాన్ హీరోగా చేస్తున్న ఈ సినిమా లో ఈయన కీలకపాత్ర వహిస్తున్నాడు. సమంత త్వరలోనే శాకుంతలం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ శాకుంతలం సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఇక తమిళంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో సమంత నటించబోతోంది. అంతేకాకుండా సమంతకు హిందీ నుంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి.