ఫారియా అబ్దుల్లా.. అక్కడి నుంచి ఫోటోలు వైరల్..?

టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించింది ఫారియా అబ్దుల్లా, జాతి రత్నాలు సినిమా ద్వారా బాగా పాపులర్ సంపాదించింది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన చిత్రం ఇది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చిట్టి క్యారెక్టర్తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఫారియా.

తొలి సినిమాతోనే బాగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె పుట్టింది హైదరాబాద్లోనే. చదివింది లయోలా కాలేజీలో. ఇక అదే కాలేజీలో కి విజిట్ గా నాగ్ అశ్విన్ వెళ్లగా అక్కడ ఆమెను చూడడంతో.. సినిమాల్లో నటించడానికి ఆసక్తి ఉంటే జాతిరత్నాలు మూవీ ఆడిషన్స్ కి రమ్మని కోరడం జరిగిందట. అలా ఆమె ఆ సినిమాలో ఛాన్సును దక్కించుకుంది.

 

తనకి చాలా ఇష్టమైన అలవాట్లలో పెయింటింగ్, బొమ్మలు వేయడం, డ్యాన్స్ వంటివి తను ఫ్రీ గా ఉన్న సమయంలో ఇవన్నీ చేస్తూ ఉంటుందట. ప్రస్తుతం ఈమె ముంబై లో ఉన్నది. అక్కడి నుంచి తమ ఫోటోలను షేర్ చేసింది ఆ ఫోటోలు కాస్త బాగా వైరల్ గా మారాయి. ఇక అంతే కాకుండా తను ఈ మధ్యకాలంలో చాలా సంతోషంగా ఉన్నాను కూడా తెలిపింది. ఇక తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించే అవకాశం వచ్చిందని చెప్పుకొస్తోంది. అయితే తన పోస్ట్ చేసిన ఫోటోలు చాలా ట్రెండ్ అవుతున్న.

ఈ ఫోటోలు చూసి నెటిజన్లు చాలా అందంగా ఉన్నది అని కామెంట్ చేస్తున్నారట. ఈ ఫోటో చూసిన తర్వాత స్టార్ హీరోలు అవకాశం ఇవ్వడం ఖాయం అని అంటున్నారు.