కమెడియన్గా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్.. నిర్మాతగా కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే బండ్లన్న.. సమాజంలో జరిగే ప్రతీ విషయంపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బండ్లకు ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది.
అయితే ఇలాంటి తరుణంలో బండ్ల గణేష్ సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు, అందుకే ట్విట్టర్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు ఓ పోస్ట్ ద్వారా తెలిపడంతో..ఆయన అభిమానులకు షాక్ తగిలినట్టు అయింది.
అయితే తాజాగా మనసు మార్చుకున్న బండ్ల గణేష్.. తన ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పాడు. `పెద్దలు జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గారు ఈరోజు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండమని నాకు సలహా ఇవ్వటం వారు ఇచ్చిన సలహాను గౌరవంగా భావించి మీ అందరి ముందు కి మళ్ళీ వస్తున్నాను` అని బండ్ల ట్వీట్ చేయడంతో.. అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. ఈ క్రమంలోనే ఆయన ట్వీట్ను తెగ వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/ganeshbandla/status/1427683042798096387?s=20