మూవీ ఆర్టిస్టు అసోసియేషన్(మా) ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడిన హేమకు భారీ ఊరట లభించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మా ప్రెసిడెంట్ నరేశ్ నిధులను దుర్వినియోగం చేశారంటూ నటి హేమ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నరేష్ ఇంత వరకూ ఒక్క రూపాయి సంపాదించలేదు కానీ, గతంలో తాము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఐదు కోట్లను ఆయన స్వాహా చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
దాంతో హేమపై నరేశ్ క్రమశిక్షణ సంఘానికి(డీఆర్సీ) ఫిర్యాదు చేశారు. హేమ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన క్రమశిక్షణ సంఘం.. ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హేమపై చర్యలు తీసుకునేందుకు సమాయత్తమైన డీఆర్సీ మూడు రోజులలో సరైన వివరణ ఇవ్వాలని హేమను ఆదేశించింది.
ఇక తాజాగా హేమ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందిన డీఆర్సీ మొదటి తప్పుగా హెచ్చరించి ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేకుండానే వదిలిపెట్టింది. మరోసారి ఇలా జరిగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. మొత్తానికి అలా హేమ బయటపడింది.