సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వ సాధారణమైన విషయం. హీరోహీరోయిన్లే కాకుండా దర్శకనిర్మాతలెందరో తమ వారసులను చిత్ర సీమకు పరిచయం చేశారు. ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మరో వారసురాలు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆమె ఎవరో కాదు సీనియర్ హీరో శ్రీకాంత్ కూతురు మేధ.
శ్రీకాంత్-ఊహ దంపతాలు కుమారుడు రోషన్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇవ్వగా… ఇపుడు 17 ఏళ్ల కూతురు మేధ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందట. ప్రస్తుతం కాలేజీ స్టడీస్ లో ఉన్న మేధ.. భరతనాట్యంలో శిక్షణ తీసుకుందట. అలాగే యాక్టింగ్ స్కిల్స్ను నేర్చుకుంటుందట.
ప్రస్తుతం ఈమె సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి శ్రీకాంత్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని.. సరైన నిర్మాణ సంస్థ, దర్శకుడి కోసం వెతుకుతున్నారని తెలుస్తోంది. కాగా, మేధ విషయానికి వస్తే.. ఆమె తన తల్లి ఊహ మారిదిగానే అచ్చు గుద్దినట్టు ఉంటుంది. అయితే చిన్నప్పుడు కాస్త బొద్దుగా ఉన్న మేధ ఇప్పుడు బక్క చిక్కి నాజూగ్గా తయారైంది.