పవన్ కళ్యాణ్‌ను దాటేసిన మెగాస్టార్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి తెరకెక్కిస్తూ దూకుడుమీద ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు అనే సినిమాను తెరకెక్కిస్తున్న పవన్, ఆ తరువాత దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్‌లో మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుం’ను రానా దగ్గుబాటితో కలిసి రీమేక్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ సినిమా, అటుపై సురేందర్ రెడ్డితో మరో సినిమా కమిట్ అయ్యాడు పవన్. ఇలా ఇన్ని సినిమాలను లైన్‌లో పెట్టిన పవన్‌ను మరో స్టార్ హీరో ఓ విషయంలో దాటేశాడు.

ఇంతకీ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోను దాటేసిన ఆ హీరో ఎవరు? ఏ విషయంలో పవన్ కళ్యాణ్‌ను ఆయన దాటేశాడు? అనేగా మీ సందేహం. పవన్‌ను దాటేసిన ఆ స్టార్ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవియే. పవన్ కళ్యాణ్ సినిమాలకు హిందీలో కూడా మంచి క్రేజ్ ఉంటుందనే విషయం తెలిసిందే. దీంతో రానా-పవన్ కలిసి నటిస్తున్న సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ను ఏకంగా రూ.23 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు ఓ తెలుగు చిత్ర హిందీ డబ్బింగ్ రైట్స్ ఈ రేటుకు అమ్ముడుపోవడం ఇదే హయ్యె్స్ట్. అయితే ఇప్పుడు తమ్ముడిని దాటేశాడు మన అన్నయ్య.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్ర హిందీ డబ్బింగ్ రైట్స్‌ను ఏకంగా రూ.26 కోట్లకు ప్రముఖ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా తమ్ముడు నెలకొల్పిన రికార్డును అన్నయ్య సునాయాసంగా అధిగమించడంతో ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇక ఆచార్య చిత్రంలో చిరుతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.