రామ్ చ‌ర‌ణ్‌ బాట‌లో స‌మంత‌..త్వ‌ర‌లోనే..?

ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ స్టార్లు ముంబైలోని కాస్ట్‌లీ ఫ్లాట్స్ పై మ‌న‌సు పారేసుకుంటున్నారు. మొన్నా మ‌ధ్య ర‌ష్మిక మంద‌న్నా ముంబైలో ఓ ఫ్లాట్ కొనుక్కుంద‌న్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఇటీవ‌లె మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముంబైలో ఖ‌రీదైన బంగ్లా కొని వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు చ‌ర‌ణ్ బాట‌లోనే అక్కినేని వారి కోడ‌లు స‌మంత కూడా వెళ్ల‌బోతుంద‌ని తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. స‌మంత ముంబైలో ఓ ప్లాట్‌ కోనేందుకు సిద్దమైందట. ఈ నేప‌థ్యంలోనే ఆమె అక్కడ మంచి ప్లాట్‌ను వేతికే పనిలో పడింద‌ని తెలుస్తోంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాల స‌క్సెస్ తో బిజీగా ఉన్న స‌మంత ఫ్లాట్ కోసం పెద్ద మొత్తాన్ని పెట్టాల‌నుకుంటుంద‌ట‌. కాగా, ప్ర‌స్తుతం స‌మంత గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంతలం అనే సినిమా చేస్తోంది. అలాగే మ‌రికొన్ని ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టింది ఈ బ్యూటీ.