నారప్ప నిర్మాత వెంకటేశ్ అభిమానులకు క్షమాపణ.. ఎందుకంటే..?

కరోనా కంగారు అన్ని రంగాలను ప్రభావితం చేసి… కోలుకోలేని దెబ్బతీసింది. సినిమా ఇండస్ర్టీకి చెందిన వారు కరోనా మిగిల్చిన విషాధాన్ని నమ్మలేకపోతున్నారు. అసలు థియేటర్ల ఓపెనింగ్ ప్రశ్నార్థకమైన వేళ… సినిమాలను నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. ఇంత వరకు చూసుకుంటే… చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలో రిలీజైన దాఖలాలు ఉన్నాయి. కానీ వెంకటేశ్ లాంటి స్టార్ హీరో నటిస్తున్న నారప్ప చిత్ర టీం కూడా ఓటీటీకే ఓటేసింది.

తాజాగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కలైపులై థాను విక్టరీ వెంకటేశ్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ మూవీని థియేటర్లో చూస్తే మజాగా ఉంటుందన్న ఆయన పరిస్థితులు అనుకూలించకే ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మూవీకి మూవీ మొఘల్ రామానాయుడు కొడుకు సురేశ్ బాబు మరో నిర్మాతగా వ్యవహరించాడు. ప్రియమణి లాంటి స్టార్ హీరోయిన్ ఇందులో వెంకటేశ్ సరసన నటించింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అమోజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.