ధోనీ ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడ‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణం ఇదే!

క్రికెట్ చ‌రిత్ర‌లో మ‌హేంద్ర సింగ్ ధోనీది చెర‌గ‌ని ముద్ర‌. ఆయ‌న హ‌యాంలోనే వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ఇండియా గెలుచుకుంది. ఎన్నో గొప్ప విజ‌యాల‌ను ఇండియాకు అందించిన ధోనీ.. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే ఆయ‌న గ‌తేడాది అనూహ్యంగా త‌న క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికి అభిమాన‌లకు షాక్ ఇచ్చారు.

క‌నీసం ఆయ‌న ఫేర్‌వెల్ మ్యాచ్ కూడ ఆడ‌లేదు. ఆ మ్యాచ్‌తో వీడ్కోలు ప‌లుకుతా అని కూడా చెప్ప‌లేదు. సంగ‌క్క‌ర ద‌గ్గ‌రి నుంచి స‌చిన్ టెండూల్క‌ర్ వ‌ర‌కు అంద‌రూ గొప్ప మ్యాచ్‌ల ద్వారా వీడ్కోలు ప‌లికి మైదానానికి గుడ్ బై చెప్పారు. మ‌రి మ‌హి ఎందుకు ఫేర్ వెల్ మ్యాచ్ ఆడ‌లేదో మాజీ సెలెక్ట‌ర్ శ‌ర‌ణ్ దీప్ సింగ్ వెల్ల‌డించారు. గ‌తేడాది ఆస్ట్రేలియాలో టీ20 వ‌ల‌ర్డ్ క‌ప్ జ‌రిగి ఉంటే ఆ మ్యాచ్ ద్వారా ధోనీ వీడ్కోలు ప‌లికే వాడ‌ని, కానీ జ‌ర‌గ‌లేద‌న్నారు. ఇక ఇండియాలో జ‌ర‌గాల్సిన టీ20వ‌రల్డ్ క‌ప్ అక్టోబ‌ర్-న‌వంబ‌ర్ కు వాయిదా ప‌డ‌టంతో అన్ని రోజులు ఫిట్‌నెస్ కాపాడుకోవ‌డం క‌ష్ట‌మ‌ని భావించి ధోనీ ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడ‌లేద‌న్నారు.