మ‌హేష్‌ను లైన్‌లో పెట్టిన అల్లు అరవింద్‌..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ మాట‌ల మాంత్రీకుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ దర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు.

Makers of Mahesh Babu's 'Sarkaru Vaari Paata' cancel update on film due to  pandemic | The News Minute

ఇదిలా ఉంటే.. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మిస్తూ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా దూసుకుపోతున్న అల్లు అర‌వింద్ మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేయ‌నున్నార‌ట‌. ఇందులో భాగంగానే ఇటీవ‌ల మ‌హేష్‌ను సంప్ర‌దించి.. ఆయ‌న్ను లైన్ పెట్టార‌ట‌ అల్లు అర‌వింద్‌. ఇక ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Director Anil Ravipudi son name Ajay Suryansh - tollywood

కాగా, గ‌తంలో మ‌హేష్‌, అనిల్ రావిపూడి కాంబోలో వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. దాంతో వీరి కాంబో రిపీట్ అయితే చూడాల‌ని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో మ‌హేష్‌, అనిల్ కాంబినేషన్‌ను గీతా ఆర్ట్స్‌ పట్టాలెక్కించే పనిలో ప‌డ‌టంతో.. ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.