టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.
ఎర్ర చందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రం ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడటంతో.. పుష్ప షూటింగ్కు బ్రేక్ పడింది. ఇక నిన్ననే ఈ సినిమా తాజా షెడ్యూల్ సికింద్రాబాద్లో రీస్టార్ట్ అయింది.
45 రోజులపాటు ఏకధాటిగా సాగే సుదీర్ఘమైన ఈ షెడ్యూల్ చిత్రీకరణతో తొలి భాగం సినిమా పూర్తి కానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పుష్ప పార్ట్ 1 విడుదలకు డేట్ లాక్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వాటి ప్రకారం.. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24వ తేదీన రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మరి ఇదే నిజమైతే.. తర్వలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.