మాట నిలబెట్టుకున్న దేవిశ్రీ..!

ఇప్పుడున్న స‌మాజంలో సోషల్ మీడియానే అంద‌రికీ ప్ర‌పంచ‌మైంది. స్మార్ట్‌ఫోన్‌లోని టిక్‌టాక్‌లు, యూట్యూట్ ఛాన‌ల్‌ల‌తో కొంద‌రు సినిమాల్లో సైతం ఆఫ‌ర్లు తెచ్చుకుంటున్నారు. సోష‌ల్ మీడియాతో పల్లెల్లో ఉన్న అద్భుతమైన టాలెంట్‏లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. వారిలో ఉన్న టాలెంట్‏ను సోష‌ల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. ఇక సింగర్స్ విష‌యానికి వ‌స్తే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇటీవల మంత్రి కేటీఆర్, ఫేమ‌స్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‏ల మధ్య ఓ గాయని సంభాషణ జరిగిన సంగతి మ‌న‌కు తెలిసిందే.

తెలంగాణలోని ఓ గాయని వీడియోని చూసిన కేటీఆర్ వెంట‌నే దేవీశ్రీ, తమన్ వంటి వారికి ట్యాగ్ చేస్తూ ఇలాంటి ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించండ‌ని ట్వీట్ చేశారు. దీంతో దేవి శ్రీ ప్రసాద్.. కేటీఆర్‏కు స్పందిస్తూ.. తాను చేస్తున్న రాక్ స్టార్ ప్రోగ్రాంలో కచ్చితంగా పాటలు పాడిస్తానని కేటీఆర్ కు మాటిచ్చాడు. అయితే మాటల్లోనే కాదు చేతల్లో నిరూపించుకున్నాడు. తాజాగా మెదక్ జిల్లాకు చెందిన ఆమెను వెతికి పట్టుకుని మరీ తన షోలో పాట పాడించారు దేవి శ్రీ. ఈ విషయాన్ని కేటీఆర్‏కు ట్యాగ్ చేసి మాట నిలెబట్టుకున్నాను అంటూ ట్వీట్ చేశారు. అంతేగాక‌ ఆ యువతి ఎంతో అద్భుతంగా పాడుతోంద‌ని ట్వీట్ చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చూసిన కేటీఆర్ స్పందిస్తూ మంచి పని చేశావ్‌ అని అభినందించారు.