కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గిందో లేదో.. మూడో వేవ్ గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది ఎంతో ప్రమాదకరమైనదని, మూడవ దశ కోరోనా వ్యాప్తికి దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డెల్టా ప్లస్ ఇప్పుడు ఏపీలోని విశాఖకు చేరిందన్న వార్త నెట్టింట వైరల్గా మారింది.
విశాఖ జిల్లాలో ఒక డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదు అయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండంతో.. ప్రజలు హడలెత్తిపోతున్నారు. అయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. అటువంటి కేసు నమోదు కాలేదని చెబుతున్నారు. మరి నిజంగా డెల్టా ప్లస్ విశాఖలో ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.