ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ ప్రారంభం కాగా ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆడపడుచులందరికీ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు సమర్పించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటినుంచో ఉంది. కాగా తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలని చిరంజీవి అభివర్ణించారు. రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని, పాడిపంటలు వృద్ధి చెందాలని.. అందరూ హ్యాపీగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జగదాంబ అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా జరుపుకోవాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
గతేడాది కరోనా కారణంగా బోనాల ఉత్సవాలు ఘనంగా జరగలేదు కానీ ఈసారి కరోనా కాస్త తగ్గుముఖం పడటంతో ప్రజలు నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బోనాలు ఉత్సవాలకి భాగ్యనగరం చాలా చక్కగా ముస్తాబు అవుతోంది. సీఎం కేసీఆర్ కూడా బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
బోనాలపండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు.తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు.వర్షాలు బాగా కురవాలని,పాడిపంటలు వృద్ధి చెందాలని,అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను pic.twitter.com/6VHLyoRw6R
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 11, 2021