రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రకుల్.. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్లతో పాటు బాలీవుడ్లో కూడా వరుస అవకాశాలు అందుకంటూ బిజీ బిజీగా గడుపుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా రకుల్కు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సర్ఫ్రైజ్ గిఫ్ట్ అందించారు. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో.. అక్షయ్ తన స్టాఫ్ తో పాటు ఇండస్ట్రీలోని చాలా మందికి కోవిడ్ టెస్టింగ్ కిట్స్ ను కానుకగా అందిస్తున్నాడు. వీటితో సొంతంగానే కోవిడ్ నియంత్రణ పరీక్షలు చేసుకోవచ్చు.
మై ల్యాబ్ వారి కోవిసెల్ఫ్ కిట్ ను అక్షయ్ పలువురికి అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే రకుల్కు కూడా ఈ కోవిడ్ టెస్టింగ్ కిట్ పంపించాడు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న రకుల్.. ఫుల్ ఖుషీతో అక్షయ్కు కృతజ్ఞతలు తెలియజేసింది.