అతి తక్కువ సమయంలో అగ్రహీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక బాలీవుడ్లో డెబ్యూ కోసం హీరోయిన్లు ఆరాటపడుతుంటే..రష్మిక మాత్రం ఏకకాలంలో బాలీవుడ్లో రెండు చిత్రాలు చేసేస్తోంది. అందులో గుడ్ బై ఒకటి.
వికాల్ బల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, పవెయిల్ గులాటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలాజీ టెలీ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఈ మధ్యే గుడ్ బై షూటింగ్ స్టార్ట్ అయింది.
అయితే తాజాగా ఈ మూవీ సెట్స్ లో అమితాబ్ బచ్చన్, రష్మిక ఉన్న పిక్ ఒకటి ఆన్ లైన్ లో లీకైంది. అమితాబ్ బచ్చన్ ఏదో చెప్తుంటే పక్కనే ఉన్న రష్మిక ఆసక్తిగా వింటూ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్గా మారింది.