బ‌న్నీ, కొర‌టాల ప్రాజెక్ట్ అందుకే ఆగిందా..?

ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో చేయాల‌నుకున్నాడు. పొలిటిక‌ల్ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది.

సీన్ క‌ట్ చేస్తే.. కొర‌టాల త‌న త‌దుప‌రి చిత్రాన్ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ప్ర‌క‌టించాడు. దీంతో ఎందువ‌ల్ల కొర‌టాల‌, బ‌న్నీ ప్రాజెక్ట్ ఆగిందో తెలుసుకోవ‌డానికి అభిమానులు ఆస‌క్తి చూపుతున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇందుకు కార‌ణం పుష్ప‌నే అని తెలుస్తోంది. నిజానికి పుష్ప సినిమా షూటింగును పూర్తి చేసి కొర‌టాల ప్రాజెక్ట్‌పైకి బ‌న్నీ రావాల్సి ఉంది.

కానీ, ఇంత‌లోనే పుష్పను రెండు భాగాలుగా తెర‌కెక్కించుకునేందుకు మేక‌ర్స్‌ నిర్ణయించుకున్నారు. దాంతో అల్లు అర్జున్ మరికొంతకాలం అదే ప్రాజెక్టుపై ఉండవలసి వచ్చింది. అప్పటివరకూ ఆగితే కొరటాలకి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. అందువ‌ల్ల‌నే త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను కొర‌టాల ఎన్టీఆర్‌తో ప్ర‌క‌టించాడ‌ని టాక్ న‌డుస్తోంది.