టాలీవుడ్ లోకి ఝుమ్మంది నాదం అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది తాప్సీ. అతి తక్కువ కాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొంది బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటాలని బూలీవుడ్ వైపు వైనం అయింది తాప్సి. టాలీవుడ్ ప్రముఖ హీరోస్ అందరితో సినిమాలు చేసింది తాప్సి. తెలుగులో మిస్టర్ పర్ఫెక్ట్.. వీర.. ఆనందో బ్రహ్మ.. గంగ, నీవెవరో లాంటి సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకొని బాలీవుడ్ వైపు పయనించింది.
తెలుగులో గ్లామర్ సినిమాలు ఎక్కువ చేసింది కానీ నటనపరంగా బాలీవుడ్ లోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ మధ్య తాప్సి ఫస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా పొందింది. తాప్సీ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన మూవీస్ కి సంబంధించిన పిక్స్ పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా తన చెల్లి షగున్ తో కలిసి దిగిన ఫోటో ఒక్కటి తాప్సి షేర్ చేసింది. ఈ జూన్ నెలను తాను ఎంతో హై స్పిరిట్ అండ్ హై హోప్ తో మొదలు పెట్టినట్లు చెప్పుకొచ్చింది తాప్సి. ప్రస్తుతం వీళ్లిద్దరి ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తుంది.