టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్ట్లో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. ఏమాయ చేసావే సినిమాతో పరిచయమైన వీరిద్దరూ సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తర్వాత ఇటు చైతు, అటు స్యామ్ ఇద్దరూ తమ కెరియర్స్ను సక్సెస్ ఫుల్గా రన్ చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే సమంత.. తాజాగా తన ఫాలోవర్స్తో ముచ్చటిస్తూ తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే భర్త చైతూ గురించి మాట్లాడుతూ..తమ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయని.. అయితే ప్రతిసారి మొదట కాంప్రమైజ్ అయ్యేది మాత్రం తానే అని సీక్రెట్ రివిల్ చేసింది సమంత.
అలాగే ఈ కరోనా సమయంలో శారీరకంగా, మానసికంగా ఎంతో దృడంగా, ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందుకే ప్రతి రోజు ఓ గంట సమయాన్ని వ్యాయామం లేదా యోగాకు కేటాయించాలని స్యామ్ తెలిపింది.