వరుస ఫ్లాపులతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ.. ఇటీవల క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని మంచి ఫామ్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. క్రాక్ తర్వాత పడిపోయిన రవితేజ మార్కెట్ కూడ బాగా పెరిగింది. ఇక ప్రస్తుతం ఈయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు.
షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో రవితేజ డ్యూయర్ రోల్ పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత శరత్ మండవ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి.సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం.. రవితేజ తన రెమ్యూనరేషన్ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. క్రాక్ సినిమా వరకు పన్నెండు కోట్ల దాకా పుచ్చుకున్న ఈ మాస్ రాజా.. ఇప్పుడు 17 కోట్ల రూపాయలకు రెమ్యునరేషన్ను పెంచాడని, శరత్ మండవ సినిమాకూ పదిహేడు కోట్లు డిమాండ్ చేశాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇకపై ఒప్పుకోబోయే సినిమాలకు కూడా అంతే చార్జ్ చేయనున్నాడట రవితేజ. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.