పలు హిందీ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై సూపర్ పాపులర్ అయిన ప్రముఖ నటుడు పర్ల్ వీ పూరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మైనర్ బాలికపై రేప్ చేసినట్టుగా ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో.. పోక్సో చట్టం కింద కేసు పెట్టి ముంబై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పురి తో పాటు ఇంకో ఐదుగురిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే పురి అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే.. అతడికి బెయిన్ వచ్చిందని ప్రచారం జరిగింది. దాంతో అతని సహ నటి కరిష్మా తన్నా హర్షం వ్యక్తం చేసింది. సత్యమేవ జయతే …సత్యమే జయిస్తుంది అని ట్వీట్ చేసింది. ఈమెతో పాటు నిర్మాత ఏక్తాకపూర్, మరో నటి అనితా హాసనందిని వంటి పలువురు పెర్ల్ పై వచ్చిన ఆరోపణలను కొట్టి పారేశారు.
కానీ, ట్విస్ట్ ఏంటంటే.. పూరికి అసలు బెయిలే రాలేదు. నిజానికి ముంబై సమీపంలోని వసాయి కోర్టు నిందితుడు పురిని 14 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ కేసులో అతడితోపాటు అరెస్ట్ అయిన మరో ఐదుగురిని కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వారికి రెండు వారాల కస్టడీకి అనుమతి ఇచ్చింది. మరి ఈ కేసు ఎంత వరకు వెళ్తుందో చూడాలి.