ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. దాంతో దర్శక నిర్మాతలు కూడా ఆ తరహా సినిమాలు చేసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. మరో మల్టీస్టారర్ చిత్రం తెరపైకి వచ్చింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు లోకనాయకుడు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో మల్టీస్టారర్ చేయబోతున్నాడన్న ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
వీరిద్దరినీ కలపబోతున్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు మురుగదాస్. క్రియేటివ్ డైరెక్టర్ గా ఎన్నో సంచలన విజయాలు నమోదు చేసిన మురుగదాస్.. తాజాగా ఓ పవర్ ఫుల్ మల్టీస్టారర్ స్టోరీని సిద్ధం చేశాడట. ఈ స్టోరీను ఇప్పటికే అటు కమల్కు, ఇటు మహేష్కు వినిపించగా.. ఇద్దరూ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది.
అంతేకాదు, ఈ మల్టీస్టారర్ చిత్రంలో మహేష్ సీబీఐ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని మరియు కమల్ ఓ యువతి తండ్రి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.