ఆ మూవీ నుండి సైడైన‌ ర‌వితేజ‌..లైన్‌లోకి వ‌చ్చిన మెగా హీరో?

క్రాక్ సినిమాతో మంచి ఫామ్‌లోకి వ‌చ్చాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. ప్ర‌స్తుతం ఈయ‌న‌తో సినిమాలు చేసేందుకు ప‌లువురు ద‌ర్శ‌కులు క్యూ క‌డుతున్నారు. ఆ లిస్ట్‌లో త్రినాథ‌రావు న‌క్కిన ఒక‌రు. ఇటీవ‌లె ఈయ‌న ర‌వితేజ‌కు క‌థ చెప్పి.. ఓకే చెప్పించుకున్నారు. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శక‌త్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్న‌ట్టు అధికారికంగా కూడా ప్ర‌క‌టించాడు.

ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించ‌బోతున్నాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ర‌వితేజ ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయ్యాడ‌ట‌.

5 Years of Varun Tej in Telugu Film Industry: Take a look at the actor's  journey in the showbiz | Telugu Movie News - Times of India

దీంతో మేక‌ర్స్ మెగా హీరో వ‌రుణ్ తేజ్‌ను లైన్‌లోకి తీసుకువ‌చ్చార‌ట‌. తాజాగా వ‌రుణ్‌ను సంప్ర‌దించి క‌థ చెప్ప‌గా.. అది బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కాగా, పూర్తి కమర్షియల్‌ హంగులతో మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటార‌ని స‌మాచారం.