ఇండస్ట్రీలో ఇప్పుడు వెబ్ సిరీస్ల హవా నడుస్తోంది. ప్రస్తుతం స్టార్ కమెడియన్ అయితన ప్రియదర్శి మెయిన్ రోల్లో ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. దీన్ని విద్యా సాగర్ అనే కొత్త డైరెక్టర్ తీస్తున్నాడు. బాషా సినిమా డైరెక్టర్ అయిన సురేష్ కృష్ణ ఈ కొత్త వెబ్ సిరీస్ కు డబ్బులె పెడుతున్నాడు. ఇందులో బిగ్ బాస్ బ్యూటీ అయిన నందినీ రాయ్ కూడా ఓ రోల్ చేస్తోంది.
అయితే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రీసెంట్గా కోలీవుడ్ హీరో కార్తీ రిలీజ్ చేశారంట. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రియదర్శి కామెడీ, యాక్టింగ్ సూపర్ అనిపిస్తోంది. కొత్త కాన్సెప్ట్ తో ఆకట్టుకునేలా ఈ ట్రైలర్ ఉంది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ఇందులోని డైలాగులు రియలిస్టిక్ గా పేలాయి. నందినీ రాయ్ బాగానే నటనకు స్కోప్ ఇచ్చింది. జూన్ 18 నుంచి ఆహా వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.