కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్ త్వరలోనే తెలుగుతో ఓ స్ట్రైట్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. నారాయణ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ముల పూర్తి స్థాయి స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో ఉండటంతో.. సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు చాలా సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలోనే ధునుష్ మరో తెలుగు దర్శకుడికి గ్రీన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మధ్య ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకు ఫిదా అయిన ధనుష్ వెంటనే సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ బడా నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్ కూడా పూర్తై ఉండటంతో.. శేఖర్ కమ్ముల మూవీ కంటే ముందు ఈ సినిమాను ధనుష్ చేయనున్నాడట. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.