తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా సెకెండ్ వేవ్ లేకుండా ఉండి ఉంటే.. ఐదో సీజన్ కూడా ఎప్పుడో ప్రారంభం అయ్యి ఉండేది. అయితే తాజాగా సమాచారం ప్రకారం.. త్వరలోనే బిగ్ బాస్ ఐదో సీజన్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది.
ఈ సారి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక కూడా గత సీజన్ మాదిరే జూమ్ యాప్లో ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు కంటెస్టెంట్ల లిస్ట్ బయటకు వచ్చింది. బిగ్ బాస్-5 కోసం శేఖర్ మాస్టర్, మంగ్లీ, హైపర్ ఆది, వర్షిణి (యాంకర్), ప్రత్యూష (యాంకర్), షణ్ముఖ్ జశ్వంత్ (యూట్యూబర్), దుర్గారావు (టిక్ టాక్ ఫేమ్), ప్రవీణ్ (కమెడియన్), శివ (యాంకర్)ల పేర్లు తెరపైకి వచ్చాయి.
అయితే ఇవి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పేర్లు మాత్రమే. అధికారికంగా ఎవరి పేరు కూడా బిగ్ బాస్ టీమ్ కన్ఫర్మ్ చేయలేదు. కానీ, షణ్ముఖ్, దుర్గా రావులు మాత్రం తమకు బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.