అర‌రే.. బాల‌య్య‌కు మ‌ళ్లీ ఆ స‌మ‌స్య మొద‌లైందా?

ప్ర‌స్తుతం మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్నాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య‌.. గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. త్వ‌రలోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు కూడా వెళ్ల‌నుంది. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. ఈ సినిమాలో కూడా బాల‌య్య‌కు హీరోయిన్ దొర‌క‌డం లేద‌ట‌. గోపిచంద్ ఇప్ప‌టికే శ్రుతి హాస‌న్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ మ‌రియు ప‌లువురు హీరోయిన్ల‌ను సంప్ర‌దించ‌గా.. వారంద‌రూ ఏవేవో కార‌ణాల వ‌ల్ల నో చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

దీంతో హీరోయిన్‌గా ఎవ‌ర్ని తీసుకోవాలో తెలియ‌క త‌ల‌ప‌ట్టుకుంటున్నాడ‌ట గోపిచంద్. కాగా, బాల‌య్య‌ను గతంలో కూడా హీరోయిన్ క‌ష్టాలు వెంటాడిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా అఖండ విష‌యంలో బాలయ్య‌కు ఇదే పెద్ద సమస్యగా మారింది. ఎంద‌రో హీరోయిన్ల పేర్లు వినిపించిన అనంత‌రం.. చివ‌ర‌కు ప్రగ్యా జస్వాల్‌ను ఎంపిక చేశారు.