సెకెండ్ వేవ్ రూపంలో ప్రజలపై విరుచుకు పడిన కరోనా వైరస్.. మళ్లీ ఇప్పుడిప్పుడే అదుపులో వస్తోంది. కరోనా కేసులు, మరణాలు తగ్గు ముఖం పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో విధించిన లాక్డౌన్ను ఎత్తేస్తున్నారు.
ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా లాక్డౌన్ ఎత్తివేతపై కసరత్తులు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
అయితే కరోనా అదుపులోకి వస్తున్న దృష్ట్యా.. రాష్ట్రంలో జూలై 1 నుంచి పూర్తిగా లాక్డౌన్ను ఎత్తేయాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 30న మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కరోనా కట్టడి, లాక్ డౌన్ ఎత్తివేత వంటి అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆ రోజే లాక్డౌన్ ఎత్తివేతపై ప్రకటన ఉంటుందని అంటున్నారు.