టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదల కానున్న ఈ చిత్రం రెండు భాగాల్లో రాబోతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. బన్నీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విషయం ఏంటంటే.. ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ డైరెక్ట్గా బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రభాస్ రూట్లోనే అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
పుష్ప తర్వాత బన్నీ కూడా బాలీవుడ్లోకి డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఇందులో భాగంగానే బాలీవుడ్ డైరెక్టర్స్ చెప్పే కథలు కూడా బన్నీ వింటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.