ఈసారి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సేతుపతి..మైత్రీ ప్లాన్ అదిరిందిగా?!

కోలీవుడ్ స్టార్ మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులోనూ స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోంగ్ సంపాదించుకున్న ఈయ‌న‌.. సైరా నరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసిన ఉప్పెన చిత్రంలో విల‌న్‌గా న‌టించి.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు.

ఉప్పెనను నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు.. విజ‌య్ తో మ‌రో సినిమాను ప్లాన్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ సారి విల‌న్‌గా లేదా వేరే వేరే కీ రోలో కాకుండా.. విజ‌య్ హీరోగా న‌టించ‌బోతున్నాడ‌ట. తాజాగా మైత్రీ వారు విజ‌య్ సేతుప‌తి వ‌ద్ద‌కు ఓ క‌థ తీసుకువెళ్ల‌గా.. అది బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పార‌ట‌.

మ‌రి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లోనే తెలియ‌నుంది. ఇక ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో కాకుండా.. మీడియం బడ్జెట్ తో తెర‌కెక్కించాల‌ని మైత్రీ వారు ప్లాన్ చేసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే..విజయ్ సేతుపతి హీరోగా చేసే స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే అవుతుంది.