వంశీ పైడిపల్లి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్లో చేరిపోయారీయన. ఇక వంశీ పైడిపల్ల చివరి చిత్రం మహర్షి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
ఈ చిత్రం తర్వాత వంశీ నుంచి మరే సినిమా రాలేదు. స్టార్ డైరెక్టర్ అయ్యుండి సినిమా.. సినిమాకు ఇంత గ్యాస్ తీసుకోవడం నిజంగా ఆశ్చర్యమే. అయితే ఇదే ప్రశ్నను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వంశీని అడగగా.. ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. `నేను కథలు రాసుకోలేను .. కథల కోసం రచయితలపై ఆధారపడవలసి వస్తోంది
ఇక కథలో మార్పులు చేయించవలసి వచ్చినప్పుడు, రచయితలను పట్టుకుని ఆ పనిని పూర్తి చేయించవలసి ఉంటుంది. అందువల్లే సినిమాలు మరింత ఆలస్యమవుతున్నాయి. ఇకపై అలా జరగకుండా ముందుగానే కథలను రెడీ చేసిపెట్టుకుంటాను` అంటూ వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం వంశీ విజయ్ దళపతి హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఓ ప్రాజెక్ట్ ను లైన్లో పెట్టాడు.