టాలీవుడ్ కరోనా వరుస విషాదాలను నింపుతుంది. తాజాగా ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు విశ్వశాంతి విశ్వేశ్వరరావు అలియాస్ యూ. విశ్వేశ్వరరావు కరోనా సోకి చెన్నై లో కన్నుమూశారు. ఈయన స్వర్గీయ నందమూరి తారక రామారావు వియ్యంకుడు అవుతారు.
ఇటీవలె ఈయన కరోనా బారిన పడిగా..హాస్పటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం క్షీణించడంతో తాజాగా తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
కాగా, కంచుకోట, నిలువు దోపిడీ, దేశోద్థారకులు, పెత్తందార్లు చిత్రాలను నిర్మించిన ఈయన.. దర్శకుడిగా తీర్పు, మార్పు, నగ్న సత్యం, కీర్తి కాంతా కనకం, పెళ్లిళ్ల చదరంగం వంటి చిత్రాలను రూపొందించారు. కొన్ని పాటలకు కూడా సాహిత్యం అందించారు. 17వ నేషనల్ అవార్డు జ్యూరీ మెంబర్ గా కూడా వ్యవహరించారు.