ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవే అనుకుంటే.. సెకెండ్ వేవ్లో మరింత వేగంగా విజృంభిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతోంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాలు నింపుతున్న కరోనా ఎప్పుడు అంతం అవుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు.
ఇలాంటి విపత్కర సమయంలో జనాలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొంతమంది అయితే భయంతోనే చనిపోతున్నారు. అందుకే థైర్యంగా ఉండటం ఎంతో అవసరం. అందుకోసం పాత జ్ఞాపకాలను నెమరువేసుకోమని సలహా ఇస్తూ పోస్ట్ పెట్టింది సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత.
ప్రస్తుతం మన చుట్టూ బాధలు, దుర్భర పరిస్థితులే ఉన్నాయి.. అయితే ఇలాంటి సమయంలో ఈ రోజు నా మొహం మీద చిరునవ్వును తీసుకొచ్చింది ఈ ఫోటో. ఇవన్నీ కూడా అద్భుతమైన మెమోరీస్. మీరు కూడా అలాంటి వాటిని వెతికి చూసుకోండి.. కాస్త నవ్వేందుకు ప్రయత్నించండని అంటూ సితార చిన్ననాటి ఫొటోను షేర్ చేసింది నమ్రత. ప్రస్తుతం ఈమె పోస్ట్ వైరల్గా మారింది.
https://www.instagram.com/p/CPIV-CPj3W7/?utm_source=ig_web_copy_link