టీకా వేయించుకున్న కీర్తి..!

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. టీకా కొరత కారణంగా అక్కడక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. కరోనా ఉధృతి ఎక్కువవుతున్న నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు, కీడాకారులు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కూడా టీకా వేయించుకున్నారు. చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె టీకా తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె కోరారు.

నేను శైలజ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్ తెలుగులో చాలా సినిమాలు చేసింది. మహానటి సినిమాతో తాను కూడా గొప్పగా నటించగలనని ప్రూవ్ చేసుకుంది. ఇటీవలే నితిన్ హీరోగా నటించిన రంగ్ దే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం కీర్తి ఇటు తెలుగు, అటు తమిళ్ లోనూ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల కీర్తి సురేష్ పెళ్లిపై రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఆ రూమర్స్ నిజం కాదని కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది.