మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించారు మెగాస్టార్. ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రెండు లక్షల రూపాయలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు గురువారం ట్రాన్స్ ఫర్ చేశారు. పావలా శ్యామల అనారోగ్యానికి గురైనప్పుడు కూడా ఇలానే రెండు లక్షల రూపాయలు అందజేశారు. ఇటీవల ఆమె ఇబ్బందుల్లో ఉందని తెలిసి మరో లక్ష సాయం అందజేశారు. పొన్నాంబళం చెన్నైలో నివాసముంటారు. అక్కడే కిడ్నీ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనకు రెండు లక్షల రూపాయలు సహాయం చేశారని తెలుసుకున్న పొన్నాంబళం చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి నటించిన ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు తదితర చిత్రాల్లో పొన్నాంబళం నటించారు. ఆయా సినిమాల్లో వీరిద్దరి మధ్యా జరిగే ఫైట్స్ ను అప్పట్లో జనం తెగ ఎంజాయ్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సాయం విషయంలో మెగాస్టార్ వెంటనే స్పందిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా చిరు సాయాన్ని చూసి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Boss @KChiruTweets has donated Rs.2 Lakh Rupees for Actor #Ponnambalam who is suffering with kidney problem . pic.twitter.com/De8weSmPni
— Chiranjeevi Trends™ (@TrendsChiru) May 21, 2021