ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కాస్త తగ్గినట్లు కనబడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమాండ్ కంట్రోల్ రూమ్ సోషల్ మీడియా వేదికగా కేసుల వివరాలను తెలియజేసింది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 12,994 కేసులు నమోదవగా.. 18,373 మంది కొవిడ్ నుండి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు.
ఇక జిల్లాలవారీగా చూస్తే నేడు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 2652 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడి తాజాగా 96 మంది మృత్యువాత పడ్డారు. ఇంతవరకు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1195 మంది మృతి చెందారు.
#COVIDUpdates: 24/05/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 15,90,926 పాజిటివ్ కేసు లకు గాను
*13,76,942 మంది డిశ్చార్జ్ కాగా
*10,222 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,03,762#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/vloYmWA8nk— ArogyaAndhra (@ArogyaAndhra) May 24, 2021