`ఉప్పెన` చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో రెండో చిత్రం కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక వైష్ణవ్ తేజ్ తన మూడో చిత్రాన్ని అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ డైరెక్టర్ గిరీషయ్య తో చేయనున్నాడని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను నిజం చేశాడు వైష్ణవ్.
ఈ చిత్రం హైదరాబాద్లోనే ఈ రోజు లాంఛనంగా ప్రారంభం అయ్యింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్న ఈ చిత్రంలో వైష్ణవ్కు జోడీగా ఉత్తరాది భామ కేతిక శర్మ నటించనుంది. ప్రస్తుతం సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.