టాలీవుడ్‌లో మ‌రో విషాదం..ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ను బ‌లి తీసుకున్న క‌రోనా!

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం విద్వాంసం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌ని ఈ మ‌హ‌మ్మారి న‌లువైపుల నుంచి ఎటాక్ చేస్తూ.. ప్ర‌జ‌ల‌కు ఊపిరాడ‌కుండా చేస్తోంది. ఈ సెకెండ్ వైవ్‌లో సామాన్యులే కాదు.. సెల‌బ్రెటీలు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు. కొంద‌రు ప్ర‌ముఖులు ప్రాణాలు కూడా విడిచారు.

తాజాగా టాలీవుడ్‌లో మ‌రో విషాదం నెల‌కొంది. తెలుగు సినీ డైరెక్ట‌ర్, రచయిత సాయి బాలాజీ ప్రసాద్ కరోనా కార‌ణంగా మృతి చెందారు. ఈయ‌న వ‌య‌సు 57 సంవ‌త్స‌నాలు. ఇటీవ‌లె క‌రోనా సోకిన సాయి గచ్చిబౌలిలోని టిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

శ్రీహరి, ఉదయ్ కిరణ్ లాంటి హీరోలతో సినిమాలు తెరకెక్కించిన అనుభవం ఉన్న దర్శకుడు సాయి బాలాజీ. ఇక కొన్ని సినిమాలకు రచయితగా.. మరికొన్ని సినిమాలకు స్క్రీన్‌ప్లే రైట‌ర్ గా వ‌ర్క్ చేశారు. చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన `బావగారూ బాగున్నారా!’ సినిమాకి పనిచేసిన స్క్రీన్‌ప్లే టీమ్ లో సాయి ఒకరు. అటువంటి వ్య‌క్తి క‌రోనాకు బ‌లి కావ‌డంతో తెలుగు ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.