పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హంబలే ఫిలిమ్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ప్రశాంత్ నీల్ ఇప్పటివరకూ తీసిన సినిమాల్లో హీరోయిన్కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అనే అపవాదం ఉంది. అయితే దీన్ని సలార్తో చేరిపేసుకోవాలని ఆయన ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలోనే శృతి హాసన్కి సలార్లో పవర్ఫుల్ జర్నలిస్ట్ పాత్రను రాసుకున్నాడట.
అంటే.. ఈ చిత్రంలో శృతిహాసన్ ఓ పొలిటికల్ జర్నలిస్టుగా కీ రోల్లో మెరువనుందన్నమట. అంతేకాదు, ఈ పాత్రలో ఒదిగిపోవడానికి జర్నలిస్ట్లు ఎలా ప్రశ్నిస్తారు? వారి తీరు ఎలా ఉంటుంది? అనే విషయాలను శ్రుతి స్టడీ చేస్తోందని తెలుస్తోంది.