శంక‌ర్‌ సినిమాకు క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న చ‌ర‌ణ్‌?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌`, `ఆచార్య‌` సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇవి పూర్తి కాగానే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. దీనిపై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌టన కూడా వ‌చ్చింది.

ఇప్ప‌టికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. పాన్‌ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని రూ.150 కోట్ల బ‌డ్జెట్‌తో దిల్‌ రాజు భారీగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాగానూ రామ్ చ‌ర‌ణ్ రెమ్యున‌రేష‌న్ కూడా క‌ళ్లు చెదిరే విధంగానే ఉంద‌ని అంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి చ‌ర‌ణ్ రూ.50 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు డైరెక్ట‌ర్ శంక‌ర్ రూ. 40 కోట్లు పారితోష‌కంగా పుచ్చుకుంటున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలి.