తీవ్ర విషాదంలో పూజా హెగ్డే..ఏం జ‌రిగిందంటే?

పూజా హెగ్డే తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇందుకు కార‌ణం ఆమెకు ఎంతో ఇష్ట‌మైన టీచర్‌ మరణవార్తే. ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకున్న పూజా.. ఎమోష‌న్ అయింది. నాకెంతో ఇష్టమైన టీచర్ శ్రీమతి జెస్సికా దారువాల మరణించారన్న వార్త తెలియడంతోనే నా హృదయం ముక్కలైంద‌ని చెప్పుకొచ్చిన పూజా..ఈ రోజు ఈ ప్రపంచం ఓ రత్నాన్ని కోల్పోయింద‌ని తెలిపింది.

నేను నిరాశ చెందిన ప్రతిసారీ ఆమె ఎంతో ధైర్యం చెప్పి చైతన్య పరిచేవారు. జెసికా మేడమ్‌ జియోగ్రఫీ టీచర్‌ అయినా నాకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పించారు. ఆరోజు చెప్పిన వాటి వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాన‌ని పూజా పేర్కొంది.

అలాంటి ఓ టీచర్‌ని మిస్‌ కావడం ఎంతో బాధగా ఉంది. ఈ కష్టకాలంలో మీ ఫ్యామిలీకి నా ప్రేమను పంపుతున్నాను అని పూజా ఎమోష‌న్ అయింది. దీంతో పూజా అభిమానులు.. ఆమెకు ధైర్యం చెబుతున్నారు. కాగా, పూజా ప్ర‌స్తుతం తెలుగుతో పాటు హిందీ, త‌మిళ చిత్రాల‌తోనూ న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే.