ప‌వ‌న్‌కు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత‌..లైన్‌లో మ‌రో ప్రాజెక్ట్‌!‌‌‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న రీ ఎంట్రీ చిత్రం `వ‌కీల్ సాబ్‌` విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకోవ‌డంతో భారీ క‌లెక్ష‌న్స్ కూడా రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పీరియాడిక్‌ డ్రామా చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు.

అలాగే ఈ మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్‌ కూడా స్టార్ట్ చేశాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తి అయిన వెంట‌నే హరీష్ శంకర్‌తో ఒక సినిమా, సురేందర్ రెడ్డితో ఒక సినిమాను చేయ‌నున్నాడు. అయితే సినిమాలు ఇంకా పూర్తి కాక‌ముందే మ‌రో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టాడు ప‌వ‌న్‌.

ప్రముఖ నిర్మాత జె పుల్లారావు నిర్మాణంలో పవన్ ఒక సినిమాను చేసేందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. ఆ విషయాన్ని స్వయంగా నిర్మాత పుల్లారావు తెలుపుతూ..పవన్ కోసం ఇప్పటికే కథ రెడీ అయింద‌ని.. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంట‌నే మా సినిమా సెట్స్ మీద‌కు వెళ్లుంద‌ని చెప్పుకొచ్చారు.