రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. వరుస హిట్లతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది.
ఇదిలా ఉంటే.. రష్మిక బర్త్డే నేడు. ఈ సందర్భంగా ఆమె ప్రస్తుతం నటిస్తున్న `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమా యూనిట్ మంచి ట్రీట్ ఇచ్చింది. శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే `ఆడవాళ్లు మీకు జోహార్లు`.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు రష్మిక బర్త్డే సందర్భంగా.. ఈ సినిమా నుంచి న్యూ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో రష్మిక చీరకట్టుతో ఎంతో సాందప్రదాయబద్ధంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.