మ‌హేష్ సినిమాపై క‌రోనా దెబ్బ‌..వెన‌క్కి త‌గ్గిన చిత్ర‌యూనిట్‌?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వాటి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్, జీ ఎమ్ బీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి క‌రోనా దెబ్బ త‌గిలింద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ సినిమాలో ఓ పాటకు సంబంధించిన కీలక సన్నివేశాలను గోవాలో చిత్రీకరించాలనుకున్నారు.

త్వరలోనే గోవాకు ప‌య‌నం అవ్వాలనుకున్నారు. కానీ, ప్ర‌స్తుతం క‌రోనా వేగంగా విజృంభిస్తున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ గోపా ప్ర‌యాణాన్ని క్యాన్సిల్‌ చేసుకుంద‌ట‌. ప్రస్తుతానికి ఆ పాటేదో ఇక్కడే చేసేద్దామ‌ని నిర్ణ‌యించుకుని.. గోవా ప్ర‌యాణం విష‌యంలో వెన‌క్కి త‌గ్గార‌ట‌.