టాలీవుడ్‌లో క‌రోనా బీభ‌త్సం..మ‌రో స్టార్ డైరెక్ట‌ర్‌కు పాజిటివ్‌!?

ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా బీభ‌త్సం సృష్టిస్తోంది. హీరోలు, హీరోయిన్లు, డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు ఇలా అంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒక‌రు క‌రోనా బారిన ప‌డుతున్నారు.

తాజాగా స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉ‍న్నారు. అనిల్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, ప్ర‌స్తుతం అనిల్ వెంక‌టేష్‌, వ‌రుణ్ హీరోలుగా ఎఫ్‌-3ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది. ఇలాంటి త‌రుణంలో అనిల్‌కు క‌రోనా సోక‌డంతో.. ఎఫ్ 3 షూటింగ్‌కు బ్రేక్ ప‌డిన‌ట్టు తెలుస్తోంది.‌